తల్లికి వందనం డబ్బులు రాలేదా? ఇలా చెయ్యండి చాలు.. ప్రభుత్వ అధికారిక ప్రకటన!
Sat Jun 14, 2025 11:24 Politics
తల్లికి వందనం పథకం బాగా అమలవుతోందనీ, కొంతమంది మాత్రం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకం లబ్దిని లబ్దిదారులు అందరూ పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందనీ, అందువల్ల లబ్దిదారులు డబ్బులు పొందేలా, ఆ ప్రక్రియను తెలుసుకునేలా చెయ్యాలని కోరుతోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాటల్లో.. "జూన్ 13, 14 తేదీల్లో అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. అలా అవ్వని వారు కంప్లైంట్ ఇచ్చేందుకు.. సోమవారం నుంచి జూన్ 26 వరకూ గడువు ఉంటుంది" అని మంత్రి తెలిపారు. కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అనే దానిపై మంత్రి ఏమన్నారంటే... "మనమిత్ర వాట్సాప్ ద్వారా ఇవ్వొచ్చు. లేదా.. GSWS అధికారిక వెబ్సైట్కి కంప్లైంట్ ఇవ్వొచ్చు. మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే, తెలియజేస్తే, సరిదుద్దుకొని అర్హుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని మంత్రి తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇవి అధికారిక గైడ్లైన్స్. వాటి ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులను జులై 5వ తేదీన.. తల్లుల అకౌంట్లలో జమ చేస్తారు. కాబట్టి.. ఆ తల్లులు ఆ తేదీ వరకూ వెయిట్ చెయ్యాలి. తల్లికి వందనం అర్హతలు: అర్హతలు అనేవి ఈ ప్రభుత్వం కొత్తగా ఏవీ రూపొందించలేదు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకానికి ఏయే అర్హతలు ఉంచిందో, వాటినే ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి కూడా కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: 24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
మరి ఆ అర్హతలు ఏంటి అనేవి చూస్తే..
* తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
* నెలకు కుటుంబ ఆదాయం పట్టణాల్లో రూ.12,000, గ్రామాల్లో రూ.10,000 దాటకూడదు.
* కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి, అదే మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండొచ్చు. రెండూ కలిపి అయితే.. 10 ఎకరాలలోపు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే, అనర్హుల కింద లెక్క. ఈ పథకానికి సంబంధించి మరిన్ని అర్హతలు కూడా ఉన్నాయి.
* కుటుంబ సభ్యులలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే, ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు.
* ఆ 4 చక్రాల వాహనం గనుక ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో లాంటిది అయితే మాత్రం.. వారికి పథకం వర్తిస్తుంది. కాబట్టి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి సంబంధించి ఇంకొన్ని అర్హతలు కూడా ఉన్నాయి.
*విద్యార్థి చదువుకుంటూ, తల్లి లేకపోతే.. అధికారులు ఆ విషయాన్ని పరిశీలించి, మనీ వచ్చేలా చేస్తారు. అలాగే.. విద్యార్థులు.. గుర్తింపు పొందిన స్కూళ్లు, కాలేజీల్లో చదువుతూ ఉండాలి. ఐతే.. పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ వంటి వాటిలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.
* విద్యార్థికి 75 శాతం హాజరు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే, ఈ స్కీమ్ ప్రకారం మనీ ఇవ్వరు. లబ్దిదారుల జాబితాలను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అర్హతలన్నీ కలిగి ఉండి కూడా ఏ తల్లులకైనా అకౌంట్లలో జూన్ 14 లోపు డబ్బులు జమ కాకపోతే, సోమవారం నుంచి సచివాలయాలకు వెళ్లి.. విషయం చెప్పవచ్చు. అప్పుడు సచివాలయ ఉద్యోగులు పరిశీలించి, ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. ఆ తర్వాత జూన్ 30 తర్వాత అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా.. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థుల విషయంలో ఈ పథకంలో చిన్న మార్పు ఉంది. వారికి వచ్చే స్కాలర్ షిప్ డబ్బును మినహాయించి, మిగతా ఎంత ఇవ్వాలో చూసి, ఆ డబ్బును అకౌంట్లలో తల్లికి వందనం పథకం కింద ఇస్తారు. ఈ పథకం కింద తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. ఎంత మంది పిల్లలు ఉంటే, అంతమందికీ ఇస్తోంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #Government #Talliki #Vandanam Scheme #Implementation #Complaint Process #APpolitics #APnews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.